Monday, September 15, 2025

దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ పోస్ట్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా పరిశ్రమలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్‌లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్షుడు దెబ్బకు దిగొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠినవైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది.

జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్‌లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం ఆధారంగా ఈ రైడ్ జరిగింది. ఇక్కడ అదుపు లోకి తీసుకున్న వారిలో ఆ దేశ వాసులే ఎక్కువగా ఉన్నారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ స్పందించారు. “ ప్రస్తుత పరిస్థితుల దృష్టా మా వ్యాపార సంస్థలు యూఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతాయి ” అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

“సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తోన్న విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టిన సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవుతుంటారు. కొంతకాలం నిపుణులైన కార్మికులను వారు మా దేశానికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వారి నుంచి మన కార్మికులు శిక్షణ పొందాలి. లేకపోతే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మేం ఆ విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నాం. మేం వారి నుంచి నేర్చుకొని, వారికంటే మెరుగ్గా రాణిస్తాం” అని ట్రంప్ రాసుకొచ్చారు.

Also Read: లండన్‌లోనూ వలసల కొలిమంటుకుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News