Friday, June 20, 2025

నేనేం చేయలేదు.. భారత్‌-పాకే పరిష్కరించుకున్నాయి: ట్రంప్

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నెలకొన్న భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాను చెప్తేనే రెండు దేశాలు యుద్ధాన్ని విరమించుకున్నాయని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. ఎమైందో ఏమో కానీ.. ఇప్పుడు మాట మార్చారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల సమయంలో తానేం చేయలేదని.. అమెరికా ప్రమేయం లేదని, వారే సమస్యను పరిష్కరించుకున్నారంటూ ఆయన చెప్పారు. బుధవారం ఓవల్ కార్యాలయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో భోజనానికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

“నేను ఆయనను ఇక్కడకు తీసుకురావడానికి కారణం, యుద్ధంలోకి వెళ్లనందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రధాన మంత్రి మోడీ కొద్దిసేపటి క్రితం వెళ్లిపోయారు. మేము భారత్ తో, పాకిస్తాన్‌తో వాణిజ్య ఒప్పందంపై పని చేస్తున్నాము. భారత్, పాకిస్తాన్ నాయకులు ఇద్దరూ చాలా తెలివైన వ్యక్తులు. ఉద్రిక్తత పరిస్థితులు అణు యుద్ధంగా మారే అవకాశం ఉన్న సమయంలో యుద్ధాన్ని ఆపాలని ఇద్దరు తెలివైన నేతలు నిర్ణయించారు. అందుకు నేను సంతోషంగా ఉన్నా” అని ట్రంప్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News