Sunday, September 7, 2025

ట్రంప్ నోట.. రోజుకో మాట

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ గొప్ప ప్రధాని అ ని ప్రశంసించారు. భారత్, రష్యాలకు దూరమయ్యాం అంటూ ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా, ఆయన స్పందించారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొ త్తంలో చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. అది తనను చా లా నిరాశకు గురి చేసిందన్నారు. అక్కడి చమురు కొనుగోలు చేయొద్దని భారత్‌కు చెప్పానన్నారు. వెనక్కి తగ్గక పోవడంతో భారత దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్‌లు కూడా విధించానన్నారు. తాను విధించిన 50 శాతం సుంకాలు చాలా ఎక్కువని అంగీకరించారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారా ? అని విలేకరి అడగ్గా..

కచ్చితంగా అని ట్రంప్ బదులిచ్చారు. ‘ నేను ఎప్పుడూ అదే కోరుకుంటా. ప్రధాని మోడీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధాని. కానీ ప్రస్తుత సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్ అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ’ అని సమాధానమిచ్చారు. ఇటీవల మోడీ అమెరికాలో పర్యటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు భారత్, రష్యాలను అమెరికా కోల్పోయిందని, అవి రెండూ చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని, ట్రంప్‌ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. ఆ మూడు దేశాలు సుదీర్ఘ, సుసంపన్న భవితవ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రష్యా, ఉత్తరకొరియాలతో కలిసి చైనా తమపై కుట్ర పన్నుతున్నట్టు ఉందని ఆయన ఆరోపించారు.’

ఆ యుద్ధం ఆపడం ఈజీ అనుకున్నా.. కానీ
‘అధికారం లోకి వస్తే ఒక్క రోజులోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తా ’ అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ పదేపదే చెప్పిన మాట ఇది. అయితే ఆ హామీని తాను నెరవేర్చలేకపోతున్నానని ట్రంప్ తాజాగా అంగీకరించారు. ఆ యుద్ధం ఆపడం చాలా ఈజీ అనుకున్నానని, కానీ తన హయాంలో చూసిన అత్యంత క్లిష్టమైన ఘర్షణ ఇదేనని వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు సుదీర్ఘ యుద్ధాలను తాను ఆపానని మరోసారి అన్నారు. అయితే రష్యాఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయానని తెలిపారు.

గోల్ఫ్ రిసార్ట్‌లో జీ20 సమ్మిట్
2023 జీ 20 శిఖరాగ్ర సదస్సును మియామి లోని తన సొంత గోల్ఫ్ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సమ్మిట్ జరగనుంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ గా మార్చే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలను అభినందించిన మోడీ
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ట్రంప్ భావాలను , ఇరుదేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోడీతన ఎక్స్ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు , వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News