- Advertisement -
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రిక ల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ 2025 ఫలితాలు వారంలో వెలువ డనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను డౌన్లోడ్కు అందుబాటులోకి ఉంచారు. ప్రాథమిక కీ ల పై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమి టీ పరిశీలించి తుదికీ ఖరారు చేయనున్నారు. అనంతరం తుది కీ తో పాటు ఫలితాలు ప్ర కటించనున్నారు. ఏప్రిల్ 29 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆన్లైన్ విధా నంలో ఎప్సెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ విభా గం పరీక్షలకు 2,07,190 మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్, ఫా ర్మా విభాగం పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 81,198 మంది విద్యా ర్థులు హాజరయ్యారు.
- Advertisement -