Monday, May 12, 2025

ఈ నెల 13న పాలిసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం(మే 13) పాలిటెక్నిక్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు. పాలిసెట్ -2025కు రాష్ట్రవ్యాప్తంగా 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పాలిసెట్ పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఒక గంట ముందుగానే అంటే ఉదయం 10 గంటలకే అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థులలో హాల్ టికెట్‌పై ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్‌పోర్టు సైజు ఫోటో, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులు తమ వెంట పెన్సిల్, ఏరాజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తీసుకొని రావాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం 60 మార్కులు, భౌతిక శాస్త్రం 30 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుందని, వ్యవసాయం, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రంలో మరో 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News