Monday, June 2, 2025

పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ప్రమాదపుటంచున ప్రయాణం వద్దు… సజ్జనార్ ట్వీట్

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడడం సర్వసాధరణంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది ఏమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్ తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఫోటోను చూస్తే, ఆ వ్యక్తి బైక్‌పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రమాదకర ప్రయాణ దృశ్యాన్ని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ తన(TSRTC MD Sajjanar) ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం. ప్రమాదమని తెలిసినా, కొందరు ఇలాగే నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు అని అన్నారు. సమయాన్ని ఆదా చేయాలని, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని ఉండే తాపత్రయంతో కొన్ని చిన్న నిర్ణయాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. మీ క్షేమమే ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రమాదపుటంచున ప్రయాణం చేయకండి. సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండి అంటూ ప్రజలకు ఆర్‌టిసి ఎండి సజ్జనార్ (TSRTC MD Sajjanar) సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News