Wednesday, September 17, 2025

రూ.148 కోట్లతో 1200 పడకల ఆస్పత్రి: టిటిడి

- Advertisement -
- Advertisement -

తిరుమల: టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రూ.5141.74 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. పోటు కాంట్రాక్టు ఉద్యోగుల స్కిల్ లేబర్ జీతాలను పెంచారు. పోటు కాంట్రాక్టు ఉద్యోగులకు అదనంగా రూ.15 వేలు ఇవ్వనున్నారు. వేద పాఠశాలల్లో అధ్యాపక జీతాలు పెంచడంతో పాటు టిటిడిలో కొత్త ఉద్యోగాల ఆమోదానికి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్విమ్స్‌ను రూ.148 కోట్లతో 1200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆకాశగంగ రోడ్డు మార్గాన్ని రూ.30 కోట్లతో నాలుగు లైన్లుగా నిర్మాణం చేపట్టారు. నారాయణ వనం, భద్రకాళీ ఆలయానికి రూ.6.9 కోట్లతో రాజగోపురం నిర్మాణం చేపట్టామని టిటిడి వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News