రాష్ట్రంలోని రైతులందరికీ ఈనె ల 25 వ తేదీలోగా రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. నా ట్లకు ముందే వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడే విధంగా భరో సా నిధులను జమ చేస్తామన్నారు. శుక్రవారం మంత్రి జిల్లాలోని రఘునాధపాలెం మండలంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. రైతు భరోసాను భూ కమతాల ప్రకారం మూడు రకాలుగా అందజేస్తామని అన్నారు. 10 ఎకరాల లోపు రైతులు 98.9 శాతం ఉం డగా, ఐదు ఎకరాల లోపు రైతులు 87.5 శాతం ఉన్నారని అన్నా రు. సీసిలింగ్ ల్యాండ్ సమయంలో మూడు కమతాలు అంటే 54 ఎకరాలు, 27 ఎకరాలు, 18 ఎకరాలుగా విభజించారని, దాని ప్ర కారమే సాయం అందుతుందని అన్నారు. తొలి విడతగా ప్రతి రైతు కి రూ.ఆరు వేల చొప్పున సాయం చేస్తామన్నారు.
వ్యవసాయ కూ లీలకు, భూమిలేని వారికి కూడా ఇందిరమ్మ అభయ హస్తం కింద త్వరలోనే జమ చేస్తామని తెలిపారు. గత సీజన్లో రైతుల సంక్షే మం కోసం రూ.36 వేల కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. రైతు లు రైతు భరోసా కంటే వరి పంట బోనస్నే అధికంగా కోరుకుంటున్నారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఏడాది ఆరు రకాల సన్న రకాల వంగడాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేశామని, త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. ఈ సీజన్లో రైతులకు ఎరువులు కొరత లేకుండా చూస్తామని మం త్రి అన్నారు. ఎరువుల షిప్ రాకపోవడం, రెండు కంపెనీలు మూతపడటం వల్ల ఎరువల విషయంలో కొంత కొరత ఉన్నప్పటికీ జూలై వరకు రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేదన్నారు. ఆగస్టులో ఎరువు లు అవసరం ఉంటుందని, ఆ నెలలో ఎదురయ్యే కొరతను అధిగమించేందుకు సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడామని, కేంద్రానికి లేఖ కూడా రాశామని తెలిపారు. పామాయిల్ పంటకు మినీమం గ్యారెంట్ ఫ్రైస్ (ఎంజిపి) పాలసీ అమలు చేసేందుకు కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందంతో భారత ప్రధాని మోడీని కలుస్తామని తెలిపారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా భారత ప్రధానికి లేఖ కూడా రాశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఆనాటి సాగునీటి ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తన పేరును ఉటంకించినందున దీనికి సంబంధించిన పూర్తి అధారాలను తాను ఘోష్ కమిషన్కు పంపించానని అన్నారు.