Friday, June 6, 2025

డ్రగ్స్‌లో కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సైబరాబాద్ బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఎపిలోని తిరుపతిలో ఎఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర పరారీలో ఉన్నారు. వీరిపట్టుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసిన అధికారులు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు గుణశేఖర్, రామచంద్రను తిరుపతిలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్‌కు

మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి మిగతా వారితో ముఠాను ఏర్పాటు చేశాడు. వారితో కలిసి కొకైన్, ఎపిడ్రిన్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు వచ్చారు. ఇక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలియడంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అప్పుడు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. గుణశేఖర్‌ను విచారిస్తే డ్రగ్స్ సరఫరా చేసే ముఠా గురించి తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News