మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..సైనిక్పురికి చెందిన వర్షిత్, కుంట్లూరుకు చెందిన భార్గవ్ యాదవ్, ఓల్డ్ అల్వాల్కు చెందిన ప్రవీణ్, వైజాగ్కు చెందిన దినేష్ మిత్రులు. వీరు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనులు చేస్తున్నారు. శుక్రవారం ఎదులాబాద్ సమీపంలోని విహారి ఫామ్హౌస్లో విందు ఏర్పాటు
చేసుకొని మరింత ఆహార పదార్థాల కోసం అర్ధరాత్రి సమయంలో నలుగురు ప్రయాణిస్తున్న కారు ఎదులాబాద్ నుండి మాదారం క్రాస్ వద్ద విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వర్షిత్, భార్గవ్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా కారు నడుపుతున్న ప్రవీణ్కు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నామోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పరుశురాం తెలిపారు.