Wednesday, April 30, 2025

రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీలోని రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్టా భవానీ నగర్‌లోని రైల్వే ట్రాక్‌పై బాధితులైన ఆరిఫ్‌ పటేల్‌, సయ్యద్‌ ఇమ్రాన్‌ల మధ్య ఘర్షణ జరిగి ఎదురుగా వస్తున్న రైలు ఢీకొంది. రైల్వే పోలీస్ ఫోర్స్, ఏరియా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఐఎంఐఎం, ఎంబీటీ నేతలు సందర్శించి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News