Monday, June 9, 2025

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని కోడి కాలనీ ప్రాంతంలోని దిల్షాద్ గార్డెన్‌లో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. రాత్రి 11.32 గంటలకు తమకు ప్రమాదం గురించి కాల్ వచ్చిందని, వెంటనే బృందాలను అక్కడికి పంపామని అగ్నిమాపక అధికారి అనుప్ సింగ్ తెలిపారు. “మేము వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చాము. ఈ ప్రమాదంలో రెండు ఈ-రిక్షాలు, కొన్ని మోటార్ సైకిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. దురదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు” అని సింగ్ చెప్పారు.

మృతులను 24 ఏళ్ల వ్యక్తి, 60 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ-రిక్షాలను ఛార్జ్ చేయడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News