Sunday, June 22, 2025

పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో ఇద్దరు కశ్మీరీలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడి కేసులో ఇద్దరు కశ్మీరీలను అరెస్టు అయ్యారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు పహల్గామ్‌వాసులు పర్వీజ్‌, బషీర్‌లను ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. పర్వీజ్‌ అహ్మద్‌, బషీర్‌ అహ్మద్‌ లు లష్కరే ఉగ్రవాదులకు షెల్టర్‌ ఇచ్చినట్టు ఎన్ఐఎ గుర్తించింది. పాక్‌ ఉగ్రవాదులే పహల్గామ్‌లో దాడి చేశారని నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు 20 నిమిషాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది  పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News