- Advertisement -
మనతెలంగాణ/కొత్తగూడెం: చత్తీస్గఢ్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వివరాల ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం చత్తీస్గఢ్ పోలీసు బలగం డిఆర్జికి మావోయిస్టులకు మధ్య సుక్మా జిల్లాలోని మంకపాల్ అటవి ప్రాంతలో హోరాహోరా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సంఘటన స్ధలంలో గాలించగా రెండు మృతదేహాలు లభించాయి. ఇందులో ఒకటి మలన్గీర్ ఏరియా కమిటీ ఎల్జిఎస్ కమాండర్ది గుండధుర్, మరొక మృతదేహం అతని గన్మాన్ ఐతుదిగా పోలీసులు గుర్తించారు. మృతిచెందిన నక్సల్ తలపై రూ 5లక్షల రివార్డు ఉంది.
Two Maoists killed in Chhattisgarh Encounter
- Advertisement -