- Advertisement -
అమెరికాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం జరిగిన రాజకీయ ప్రేరేపిత కాల్పుల్లో మిన్నెసోటా హౌస్ మాజీ స్పీకర్ మెలిస్సా హోర్ట్మన్, ఆమె భర్త మరణించగా, రాష్ట్ర సెనేటర్ జాన్ హాఫ్మన్, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. రెండు దాడులు శాసనసభ్యుల నివాసాలపై జరిగాయని అధికారులు నిర్ధారించారు. దీనిని ప్రజాప్రతినిదులను లక్ష్యంగా చేసుకున్న దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడులను ధృవీకరించిన గవర్నర్ టిమ్ వాల్జ్.. హింసను ఖండించారు. ఇది “ప్రజాస్వామ్య ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి” అని పేర్కొన్నారు.
ఈ దాడికి పాల్పడిన వ్యక్తి శాసనసభ్యుల ఇళ్లలోకి ప్రవేశించడానికి చట్ట అమలు అధికారిగా నటించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని.. దాడుల వెనుక ఉన్నవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
- Advertisement -