Saturday, June 28, 2025

ఎసిబి వలలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ ఐ) ఏ .వినోద్, బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఎన్ విజయ్ కుమార్ ఎసిబి వలలో చిక్కుకున్నారు. ఎసిబి డిఎస్‌పి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్నకొండ ప్రసాద్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతులు పొందాడు. అయితే, ఇంటినెంబర్ కోసం మే 23వ తేదీ నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

ఇంటి నెంబర్ కోసం రూ.5 వేలు ఇస్తే ఇంటి నెంబర్ ఇస్తామని ఆర్‌ఐ, బిల్ కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. శనివారం ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్‌ఐ, బిల్ కలెక్టర్‌ను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశామని, కోర్టుకు హాజరుపరుస్తామని ఎసిబి డిఎస్‌పి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సోదాలో ఎసిబి సిఐలు కృష్ణ కుమార్, పున్నం చందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News