- Advertisement -
జైపూర్: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. తన కెరీర్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ ఐపిఎల్ సీజన్ ఆరంభంలో తన బ్యాటింగ్తో అంతగా రాణించలేదు. కానీ, చివర దశలో మంచిగా పరుగలు రాబడుతున్నాడు. ఐపిఎల్ లీగ్ దశలో జరిగే చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మను రెండు అరుదైన రికార్డును ఊరిస్తున్నాయి.
రోహిత్ (Rohit Sharma) ఈ మ్యాచ్లో మూడు సిక్సులు కొడితే.. ఐపిఎల్లో 300 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకూ కేవలం క్రిస్ గేల్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. మరోవైపు ఈ మ్యాచ్లో 67 పరుగులు చేస్తే.. 7000 పరుగుల మైలురానికి రోహిత్ చేరుకుంటాడు. ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనత సాధించాడు.
- Advertisement -