ప్రవర్తన మార్చుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు బలన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే…బాలాపూర్ పొలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, ఉదయగిరి గ్రామానికి చెందిన వి వెంకటేశ్ కుటుంబం బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం నగరానికి వలస వచ్చి శివార్లలోని బాలాపూర్లో నివాసం ఉంటోంది. వెంకటేశ్ కేంద్ర రక్షణ రంగ సంస్థ ఆర్సిఐలో ప్రైయివేటుగా ఉద్యోగం చేస్తుండగా ఆయన భార్య రమణమ్మ ఇంట్లోనే ఉంటుంది. వీరికి వినీల (17), అఖిల (16) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వీరిలో పెద్దకుమార్తె తాను ప్రేమించిన యువకుడితో కలిసి కొంతకాలం క్రితం ఇంట్లో నుండి పారిపోయింది. అనంతరం పెద్దల సమక్షంలో అమెకు నచ్చజెప్పి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అప్పటినుండి వినీల, అఖిలలు తల్లి,దండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పద్ధతి మార్చుకోవాల్సిందిగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ రెయిలింగ్కు చున్నీలతో ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడారు. విషయం తెలుసుకొని సంఘట నస్థలానికి చేరుకున్న పొలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.