- Advertisement -
ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చినగడువును భారత విశిష్టగుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడిఎఐ) మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారం( జూన్ 14)తో ముగియనున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 14 వరకు అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్టుచేసింది. ఆధార్ను అప్డేట్గా ఉంచేందుకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు అవకాశాన్ని మరోసారి కల్పిస్తున్నామని, దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ డేటాబేస్లో ప్రస్తుత, కచ్చితమైన సమాచారాన్ని ఉంచేందుకు గాను ఆధార్ హోల్డర్లకు ఉడాయ్ ఈ అవకాశం కల్పిస్తోంది.
- Advertisement -