Tuesday, June 3, 2025

రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడులు

- Advertisement -
- Advertisement -

40 విమానాలు ధ్వంసం ..సైబీరియా హిట్
కీవ్ : రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్లు ఆదివారం భీకర దాడికి దిగాయి. కనీసం 40 విమానాలు ధ్వంసం అయ్యాయి. అదును చూసుకుని , అత్యంత వ్యూహాత్మకంగా రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి జరిపింది. ఎయిర్‌బేస్‌పై మారుమూల ప్రాంతం నుంచి ఉక్రెయిన్ వైమానిక దాడి జరిపిందని ఇరుకుస్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ నిర్థారించారు. ఈ ప్రాంతంలోని శ్రిద్ని గ్రామం శివార్లలో సైనిక స్థావరం ఉంది.

ఉక్రెయిన్‌కు చెందిన సెక్యూరిటీ సర్వీస్ (ఎస్‌బియు) ఈ భారీ స్థాయి సైనిక చర్యకు పాల్పడిందని, 40 కు పైగా యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. రష్యాలోని మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను కూడా ఎంచుకుని ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడింది. ఇటీవలి కాలంలో రష్యా కీవ్ ఇతర ప్రాంతాలపై భీకర స్థాయిలో డ్రోన్ల దాడులకు పాల్పడుతూ , ఉక్రెయిన్‌కు భారీ నష్టం కలిగిస్తోంది. ఈ దశలోనే ఉక్రెయిన్ తమ భూభాగానికి వేల మైళ్ల దూరపు మారుమూల రష్యన్ ప్రాంతాలను ఎంచుకుని దాడులకు దిగడం కీలక పరిణామం అయింది. పైగా సైబీరియా ప్రాంతంపై ఉక్రెయిన్ దాడి జరపడం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News