Monday, June 23, 2025

యుద్ధంలోకి అమెరికా

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని వైట్‌మన్ ఎయిర్ బేస్ నుంచి ఇరాన్‌పై దాడికి బయలుదేరిన ఏడు బి2 స్పిరిట్‌లు,
ఎనిమిది కెసి-135 స్ట్రాటో ట్యాంకర్లు 37 గంటల ప్రయాణం తర్వాత టార్గెట్ ఛేదన శక్తిమంతమైన
జిబియు57 బంకర్ బస్టర్ల ప్రయోగం 100 మీటర్ల మేర పర్వతాలను చీల్చుకెళ్లి భూగర్భ అణు
కేంద్రాలను ధ్వంసం చేసిన బాంబర్లు దాడులను సిచ్యువేషన్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా
పర్యవేక్షించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడులను స్వయంగా ధ్రువీకరించిన అమెరికా
అధ్యక్షుడు ఫోర్డో అణుస్థావరం సర్వనాశనం అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ శాంతి
కావాలో.. విషాదం కావాలో తేల్చుకోవాలని ఇరాన్‌కు హెచ్చరిక చరిత్ర సృష్టించారని ట్రంప్‌నకు
ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ప్రశంస దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ అమెరికాకు శాశ్వత
గాయం తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్‌తో
ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితి, రష్యా, చైనా సహా పలు దేశాలు తీవ్ర ఖండన
అమెరికా చర్యను సమర్థించిన బ్రిటన్ భద్రతా మండలి అత్యవసర సమావేశం

దుబాయ్/టెహ్రాన్/వాషింగ్టన్ : ఆదివారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై దాడులకు దిగింది. ఇజాయెల్ ఇరాన్ మధ్య సాగుతున్న ఘర్షణల దశలో అమెరికాప్రత్యక్ష జోక్యం విషయంలో ట్రంప్ ఇన్నిరోజులు ఏమి చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు. ఒక్కరోజు క్రితం ఇరాన్‌కు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే 24 గంటల వ్యవధిలోనే ఇరాన్‌పై అమెరికా ఆకస్మిక దాడులకు దిగింది. ఈ పరిణామం ఇరాన్‌ను కలవరపర్చింది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామంపై ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతీయ ఘర్షణ ఎంత దూరం వెళ్లుతుంది? ఏ ప్రాంతాల వరకూ విస్తరిస్తుందనే భయాలు నెలకొన్నాయి.

కొండలను , దుర్భేధ్య ప్రాంతాలను కూడా పిండిచేయగల శక్తివంతతమైన బి 2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో అమెరికా వైమానిక దళ విమానాలు ఇరాన్‌లోని నిర్ణీత లక్షాలను ఎంచుకుని బాంబుల వర్షం కురిపించాయి. ఈ చర్యతో యుద్ధ వాతావరణం మరింత భగ్గుమంది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఇతర కీలక కమాండర్లు ఎక్కడున్నారు? ఏ కలుగుల్లో ఇరాన్‌కు చెందిన ప్రధాన అణు స్థావరాలు దాగి ఉన్నాయి? అనే విషయాలన్ని కూడా తమ దేశ ఇంటలిజెన్స్ విభాగానికి తెలుసు. దీనికి అనుగుణంగానే కొండలను కూడా దెబ్బతీయగల శక్తివంతమైన బి 2 బాంబులతో ఇరాన్‌పై దాడి జరుగుతుందని చెపుతూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు అన్నంత పని ముందుగానే చేశారు. 30 వేల పౌండ్ల బరువైన బంకర్ బ్లస్టర్ బాంబులను తీసుకువెళ్ల గలిగే సామర్థపు ఆరు బి 2 స్టెల్త్ బాంబరు విమానాలు మిసోరీ నుంచి బయలుదేరిన ఆరు గంటలలోనే ఇరాన్‌లోని కీలక నిర్ణీత స్థావరాలపై దాడులు జరిగాయి.

అమెరికా సాగించిన దాడులకు ది ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ అని పేరు పెట్టారు. ఈ మొత్తం ప్రక్రియలో 125కు పైగా యుద్ధ విమానాలు వివిధ దశలో పాల్గొన్నాయి. దాడులు ఆరంభ ఆదేశాలు వెలువరిస్తూనే ప్రెసిడెంట్ ట్రంప్ వైట్‌హౌస్ నుంచి జాతిని ఉద్ధేశించి మాట్లాడారు. అత్యంత కీలకమైన మూడు అణు కేంద్రాలు ఫొర్డో , నటాంజ్, ఇస్‌ఫహాన్‌లను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. ప్రత్యేకించి తాము ఎంచుకున్న ఫోర్డో స్థారవంపైనే అత్యధిక బాబబర్లను వాడినట్లు తెలిపారు. పసిఫిక్ పై పలు ఫైటర్ విమానాలను మొహరించి సిద్ధంగా ఉంచిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికా సైనిక బలగాల సంయుక్త అధినేత జనరల్ డన్ కైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

మొత్తం మీద ఏడు స్టీల్త్ బి 2 బాంబర్లను దాడులకు వినియోగించారు. తమ బాంబరు విమానాలు ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాలపై దాడి జరిపాయి. ఇక ఇస్ఫహాన్ కేంద్రంపై అమెరికాకు చెందిన టామ్‌హాక్ మిస్సైల్స్ విరుచుకుపడ్డాయి. మిసోరిలోని వైమానిక స్థావరాల నుంచి బాంబర్లు వేర్వేరు సమయాలలో బయలుదేరి, లక్షాలను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చాయని ఆర్మీ చీఫ్ తెలిపారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తరువాత సాగిన బి 2 సుదీర్ఘ మిషన్ ఇదే అని వెల్లడించారు. అమెరికా దాడులకు 14 బంకర్ విచ్ఛిన్న బాంబులు, రెండు డజన్లకు పైగా క్షిపణులు , 125కు పైగా సైనిక విమానాలు వాడినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News