Wednesday, August 27, 2025

సుంకాల మోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ ఉత్పత్తులపై అమెరికా అదనంగా విధించిన 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తున్నది. ఈ మేరకు అమెరికా ఓ ముసాయిదా నో టీసు జారీ చేసింది. దీని ప్రభావం భారతదేశం అమెరికాకు చేసే 48 బిలియన్ అమెరికా డాలర్ల ఎగుమతులపై పడుతుంది. అ మెరికా మార్కెట్ లో ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకం మొత్తం మీద ఇప్పుడు 50శాతంగా ఉంటుంది. రష్యా నుంచి చ మురు, సైనిక పరికరాలు కొనుగోలు చేసినందుకు జరిమానాగా అమెరికా ఆగస్టు 7న భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుం కాన్ని విధించింది. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన సుంకాలు 2025 ఆగ స్టు 27 మధ్యాహ్నం 12.01 గంటల నుంచి అమలులోకి వస్తాయని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పే ర్కొంది.

అధిక సుంకాన్ని చెల్లించాల్సిన ఉ త్పత్తులలో వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు,  తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, యంత్రాలు ఉన్నాయి. ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ అదనపు సుంకం వర్తించదు. భారతదేశంతో పాటు బ్రెజిల్ పై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతులపై దాదాపు 48.2 బిలియన్ డాలర్ల అదనపు సుంకాలు చెల్లించాల్సివస్తుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించేలా వత్తిడి తెచ్చేందుకే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశంపై ఆంక్షలు విధించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ నెలారంభంలో పేర్కొన్నారు.

కాగా, రష్యా చమురును తిరిగి అమ్మడం ద్వారా భారతదేశం ఆర్థికంగా లాభపడిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు. అమెరికా చర్యను ఆగస్టు 6నే భారతదేశం గర్హించింది. అది అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. కొత్త లెవీ తర్వాత తక్కువ సుంకాల కారణంగా భారతదేశ పోటీదారులు మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, చైనా, శ్రీలంక మలేషియా, ఫిలిఫైన్స్, వియత్నాం అమెరికా మార్కెట్ లో మెరుగైన స్థానంలో ఉంటారు. 2021-22 తర్వాత అమెరికా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. 2024-25లో ద్వైపాక్షక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా డేటా ప్రకారం భారతదేశ ఎగుమతులు 91.2 బిలియన్ అమెరికా డాలర్లు. 50శాతం సుంకం వల్ల తీవ్రంగా ప్రభావం పడేది వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యల ఎగుమతుల పైనే. అమెరికా భారీ సుంకాల కారణంగా భారతీయ పరిశ్రమలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా – భారత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై స్పష్టత వచ్చేవరకూ కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుని, ఉత్పత్తిని నిలిపివేయవలసి ఉంటుందని తోలు, పాదరక్షల పరిశ్రమ అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News