Friday, June 20, 2025

విద్యార్థి వీసాల జారీ ప్రారంభించిన అమెరికా

- Advertisement -
- Advertisement -

అమెరికా విదేశీ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా చిన్న మెలిక పెడుతూ విదేశాంగ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీయులు తమ షోషల్ మీడియా ప్రొఫైల్స్ ను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అమెరికా వ్యతిరేక కంటెంట్ ఏమైనా ఉంటే దానిని స్క్రీనింగ్ చేయవచ్చు. మే నెల చివరిలో విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేయడాన్ని విదేశాంగ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్తగా సోషల్ మీడియా మార్గదర్శకత్వాన్ని తీసుకువచ్చింది. మళ్లీ ఈ నెలలో వీసాల కోసం దరఖాస్తులను తీసుకోవడం ప్రారంభించింది. అమెరికా సందర్శించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ తాము సరిగ్గా స్క్రీనింగ్ చేస్తున్నామని, మెరుగైన సోషల్ మీడియా పరిశీలన నిర్ధారిస్తుందని స్టేట్ డిపార్ట్ మెంట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

యూఎస్ కాన్సులర్ అధికారులు అందరు విద్యార్థులతో పాటు టూరిస్ట్ వీసాలపై దేశాన్ని సందర్శించే వారి దరఖాస్తు దారులను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. స్క్రీనింగ్ ను సలభతరం చేయడానికి విద్యార్థులు తమ వీసా దరఖాస్తులతో పాటు, అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ లోని రహస్య సెట్టింగ్ లను బహరంగం చేయవలసిందిగా
కోరుతున్నట్లు ఆ అధికారి తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రోజునే డోనాల్డ్ ట్రంప్ ఓ
అడ్మినిస్ట్రేటివ్ జారీ చేస్తూ, అమెరికాలో ప్రవేశించే వ్యక్తులు ఎవరైనా , అమెరికా పౌరులు,సంసృ్కతి, ప్రభుత్వం, సంస్థల పట్ల శతృత్వ వైఖరి కలిగి ఉండకుండా వారిపై నిఘా పెట్టాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదట్లోనే అక్రమ వలసదారులపై విద్యార్థి వీసాలపై కొరడా ఝుళిపించింది. వేలాది మంది వీసాలు రద్దుచేసింది.

అలాగే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను అంగీకరించకుండా నిషేధం విధించాలని భావించింది.అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కొరడా ఝుళిపించారు.గాజాలో ఇజ్రాయల్ దాడిని విమర్శించేవారు, పాలస్తీనా కుమద్దతుగా ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల వీసాలను విదేశాంగ మంత్రి మార్కో రుబియో రద్దు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News