Sunday, June 15, 2025

ప్రతిఘటిస్తున్నది మేము.. సాగిలపడింది మీరు

- Advertisement -
- Advertisement -

నాడు జగన్ సర్కార్‌తో బిఆర్‌ఎస్ కుదుర్చుకున్న లోపాయికారి
ఒప్పందాలే తెలంగాణకు శాపంగా మారాయి బనకచర్లను
తిరస్కరించాలని జనవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం జూన్ 13న
మరోసారి లేఖ రాశాం డిపిఆర్ ప్రతిపాదనలను అడ్డుకోవాలని,
టెండర్లను రద్దు చేయాలని కోరాం కృష్ణా జలాల్లో తెలంగాణ
వాటా కుదించింది మీరు కాదా? హరీశ్‌రావుకు నీటిపారుదల
మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్: బనకచర్ల-గోదావరి లింక్ ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించిందే తమ ప్రభుత్వమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మంత్రి ఉత్తమ్ తీవ్రంగా స్పం దించారు. బిఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కె సిఆర్, ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహ న్ రెడ్డి లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందాలు  తెలంగాణకు శాపంగా మారాయని విమర్శించారు. ఏపి సిఎం నిధుల కోసం రాసిన లేఖపై తాను జనవరి 22 నే కేంద్రానికి రాసిన లేఖను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉదహరించారు. అధికారికంగా ఉన్న అభ్యంతరాలను లేవనెత్తుతూనే జూన్ 13 నాటి ప్రతిపాదనలను తిరస్కరించడంతో పాటు డిపిఆర్ ప్రతిపాదనలను నిలువరించి టెండర్లను రద్దు చేయాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్దంగా ఉందన్నారు. ఏపి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం దీనికి సంబంధించిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.

శుక్రవారం ఆయన రాసిన లేఖలో ఏపి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్(డిపిఆర్) ను అడ్డుకోవడంతో పాటు ప్రాజెక్టు టెండర్లను కూడా నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపి ప్రభుత్వం దూకుడుచర్యలు తెలంగాణకు శరఘాతంగా మారుతున్నాయని, గోదావరి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఏపి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణాకు దక్కాల్సిన గోదావరి నదిజలాల వాటా హక్కును ప్రత్యక్షంగా దిక్కరించడమే అవుతుందని మంత్రి ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. ఏపి ప్రభుత్వం డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్(డిపిఆర్) సమర్పించడం అంటే కేంద్ర జల వనరుల సంఘం ఆమోదించి నట్లు అవుతుందా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో సూటిగా ప్రశ్నించారు. ఏపి వెనుకబాటు తనాన్ని అడ్డు పెట్టుకుని బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రంపై నిధుల కోసం వత్తిడి చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపి ముఖ్యమంత్రి లేఖ రాసిన ఉదంతాన్ని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు.

ఇరురాష్ట్రాల గోదావరి నదీజలాల వాటాల ఖరారు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదిస్తుందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. బనకచర్ల-గోదావరి లింక్ ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించిందే తమ ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటనపై మంత్రి ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. బిఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిలు లోపాయకారికంగా కుదుర్చుకున్న ఒప్పందాలు తెలంగాణకు శాపంగా మారాయని విమర్శించారు. ఏపి సిఎం నిధుల కోసం రాసిన లేఖపై తాను జనవరి 22 న కేంద్రానికి రాసిన లేఖను మంత్రి ఉత్తమ్ ఉదహరించారు. అధికారికంగా ఉన్న అభ్యంతరాలను లేవనెత్తుతూనే జూన్ 13 నాటి పి.ఎఫ్.ఆర్ లను తిరస్కరించడంతో పాటు డి.పి.ఆర్ ప్రతిపాదనలను నిలువరించి టెండర్ల ను రద్దు చేయాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్దంగా ఉందన్నారు.

బిఆర్‌ఎస్ ఉదాసీనతే కారణం
తెలంగాణా నీటి హక్కుల అంశంలో ఆనాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదాసీనతే కారణమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో చేసుకున్న నీటి కేటాయింపులతోనే తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. వాస్త్తవానికి కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా 724 టిఎంసిలు ఉండగా 290 టిఎంసిలకు కుదించి ఏపి ప్రభుత్వానికి 512టిఎంసిల నీటిని అప్పగించిన ఘనత బి.ఆర్.ఎస్ పాలకులది అని ఆయన విమర్శించారు. వారు తీసుకున్న నిర్ణయంతోనే ఈనాడు రాష్ట్రంలో నీటి సంక్షోభానికి కారణంగా మారిందన్నారు. మచ్చుమర్రి, మాల్యల ప్రాజెక్టులకు అక్రమంగా నీటిని తరలిస్తున్న సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకం టెండర్ల ప్రక్రియ సాగుతుంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎపెక్స్ కౌన్సిల్ ను ఎందుకు ఆశ్రయించ లేదని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News