అందులో 63 టిఎంసిలు మళ్లీ
సముద్రంలోకి వదిలిపెట్టారు
మిగతా 99 టిఎంసిలతో
22లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా
ఇచ్చారో హరీశ్రావు చెప్పాలి
బిఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి వల్లే
కాళేశ్వరానికి తీరని నష్టం
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజం
మన తెలంగాణ / హైదరాబాద్ ః నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమిషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు అవాస్తవిక ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టపై బిఆర్ఎస్ ప్రచారానికి అంశాలవారీగా కౌంటర్ ఇచ్చారు.
ఐదేళ్ళలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టిఎంసీలేనని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రా జెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పింది మీరేనని, ఆ బ్యారేజి నుంచి ఎత్తిపోసిన నీరే కాళేశ్వరం నీటిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నా రు. 2019లో బ్యారేజి నిర్మాణం పూర్తి అయ్యింది, 2019-20 సంవత్సరంలో 61 టిఎంసిలు, 2020-21 సంవత్సరంలో 31.82 టిఎంసిలు, 2021-22 సంవత్సరంలో 33 టిఎంసిలు, 2022-23 సంవత్సరంలో 25.97 టిఎంసిలు, 2023-24 సంవత్సరంలో 8.91 టిఎంసిల నీరు కలిపి 162 టిఎంసిలు మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారని తెలిపా రు. ఇందులో మళ్ళీ వరదలు రాగానే స ముద్రంలోకి వదిలిని నీరు 63 టిఎంసిలు కాగా, ఐదేళ్ళలో 99 టిఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారో చెప్పాలని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు.
2022 జులైలో వరదలకు సిరిపురం(అన్నారం) పంప్హౌస్ నీట మునిగింది. అదే సంవత్సరం కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్ హౌస్ బ్రెస్ట్ వాల్ కూలి పంప్హౌస్లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని, ఆ సంవత్సరం 25 టిఎంసిలే నీటిని ఎత్తిపోశారని తెలిపారు. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజి కుంగిందని తెలిపారు.బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కట్టేది. ఫరక్కా బ్యారేజి కట్టింది నీటి మళ్ళింపు కోసమే రాక్ (రాతి) పునాది వల్లే ఆ బ్యారేజి మనగడ సాగిస్తోందన్నారు. 1975లో ఫరక్కా బ్యారేజి కట్టినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని, మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బ్యారేజిలు ప్రతిపాదించింది బిఆర్ఎస్ హ యాంలోనే, నిర్మాణం జరిగింది కూడా బిఆర్ఎస్ హాయంలోనే, మేడిగడ్డ కుంగింది కూడా బిఆర్ఎస్ హాయంలోనే అని గుర్తుచేశారు. ఫరక్కా బ్యారేజిని నీటి మళ్ళింపు కోసం కడితే కాళేశ్వరం బ్యారేజిలు కట్టింది నిధుల మళ్ళింపు కోసం అని, కెసిఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం బ్యారేజిలే ప్రత్యక్ష సాక్షం అని మంత్రి ఉత్తమ్ వివరించారు.
తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజిని కడతామని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ఎనుగులతో ర్యాలీలు తీయలేదా..? బ్యారేజి కట్టకుండా ఎందుకు పక్కన పెట్టారు ? తుమ్మిడిహట్టి కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని, మీకు పైసలు రావనే ప్రధాన కారణ కాదా అని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి వంద కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగింది. తుమ్మిడిహట్టి బ్యారేజి కడితే వంద కిలోమీటర్ల దాకా గ్రావిటీతో నీళ్లు వచ్చేది. మేడిగడ్డ వల్ల వంద కిలోమీటర్ల కిందికి వెళ్లి నీటిని ఎత్తిపోయడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేదయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పి పోతల పథకం అని విమర్శించారు. ఐదేళ్లలో 162 టిఎంసి నీటిని ఎత్తిపోసి 62 టిఎంసిలను తిరిగి సముద్రంలోకి వదిలేయడానికి కట్టిన పథకం అని ఎద్దేవచేశారు.శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్ మా నేరు, అప్పర్ మానేరు, సింగూరు రిజర్వాయర్లు మీ హాయంలోనే కట్టలేదు. ఆ ప్రాఎక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద రూ.6,156 కోట్లను వెచ్చించడం జరిగిందని, 2016 నాటికి రూ.11,679 కోట్లను వెచ్చించారని తెలిపారు.
కాళేశ్వరం బ్యారేజి వైఫల్యానికి ప్రధాన కారకులు కెసిఆర్, హరీష్రావులేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నాసిరకం పనులు చేపట్టి, ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిపోయి ఎదురుదాడిగి దిగడం అవివేకమన్నారు. మీ కమీషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందన్నారు.
తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని ఏరోజు కూడా సిడబ్లూసి చెప్పలేదని, పైసల కక్కుర్తి కోసమే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి ప్రాజెక్టు రూ.38వేల కోట్లతో పూర్తి అయితే ఇప్పటికే తమ్మిడిహట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదన్నారు. దాదాపు రూ.62వేల కోట్లు ఆదా అయ్యేవని, వాటితో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, ఎస్ఎల్బిసజి, డిండి, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పూర్తి అయ్యేవన్నారు. బిఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి శాశ్వత నష్టం వాటిల్లిందని, ప్రజలపై ఏటా రూ.16వేల కోట్ల వడ్డీల భారం పడుతుందని, బిఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం అన్ని పంపులు నడిచినప్పుడు విద్యుత్ భారమే ఏడాదికి రూ.10వేల కోట్లు అయ్యేవని, అన్ని విధాలుగా మీ తప్పుడు నిర్ణయాలకు తెలంగాణపై ఆర్ధిక భారం శాశ్వతంగా నిలిచిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.