- Advertisement -
హైదరాబాద్: కన్న కూతురుపై తల్లి సమక్షంలో ప్రియుడు, మరో వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ తన భర్తతో విడిపోయి ప్రియుడు సుమిత్ పట్వాల్లో సహజీవనం చేస్తోంది. సదరు మహిళకు 13 ఏళ్ల కూతురు ఉంది. తల్లి సమక్షంలోనే ఆమె కూతురుపై ఆమె ప్రియుడు సుమిత్, సహాయకుడు శుభమ్ పలుమార్లు అత్యచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. హరిద్వార్, మీరట్, షాపూర్ ప్రాంతాలలో తీసుకెళ్లి బాలికపై ఇద్దరు అత్యాచారం చేశారు. తండ్రికి బాలిక జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సదరు మహిళ బిజెపి మహిళా మోర్చా నాయకురాలని సమాచారం.
- Advertisement -