గొప్ప యోధుడైన హనుమంతుడు కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. భారీస్థాయిలో 3డి యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ’వాయుపుత్ర’, హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్.. ఈ సినిమా అందించాలనుకుంటున్న ఇతిహాస స్థాయి, ఆధ్యాత్మిక లోతును సంపూర్ణంగా సంగ్రహిస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యం. కథకుడిగా చందూ మొండేటి దార్శనికత, నిర్మాతగా నాగవంశీ నైపుణ్యంతో ‘వాయుపుత్ర’ భారతీయ సినిమాని పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉంది.