తమిళ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తన్న తాజా చిత్రం ‘జన నాయగన్’. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీని విజయ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ చిత్రం ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో విజయ్తో కలిసి నటించడంపై మమితా తన అనుభూతిని పంచుకున్నారు.
జననాయగన్ షూటింగ్ సమయంలో విజయ్ని (Thalapathy Vijay) మమితా ఇది మీ చివరి సినిమా అని అంటున్నారు.. నిజమేనా? అని ప్రశ్నించగా.. విజయ్ ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారని పేర్కొంది. సినిమా షూటింగ్ చాలా సరదాగా గడిచిందని.. షూటింగ్ చివరి రోజు అందరూ ఎమోషనల్ అయ్యామని తెలిపింది. విజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారని చెప్పింది. అందుకే ఆయన టీంతో కలిసి ఫోటోలు కూడా దిగలేదని పేర్కొంది. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి ఇప్పుడే చెప్పను అని.. స్క్రీన్పైనే చూడాలని కోరింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.