గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు గురువారం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ చేసిన కొద్ది సేపటికే విషాదానికి గురయింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందారని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ తెలిపారు. ‘రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపానీ విమానం కూలిపోయిన ఘటనలో మృతిచెందడం చాలా విషాదకర విషయం.
ఇది బిజెపి కుటుంబానికి ఓ విషాద వార్త’ అని కేంద్ర జలశక్తి మంత్రి, బిజెపి రాష్ట్ర యూనిట్ చీఫ్ అయిన పాటిల్ విలేకరులతో అన్నారు.విజయ్ రూపానీ(68) రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 2016 ఆగస్టు 7 నుంచి 2021 సెప్టెంబర్ వరకు సిఎం పదవిలో ఉన్నారు. ఆయన పశ్చిమ రాజ్కోట్ స్థానం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ బిజెపి ఇన్ఛార్జ్గా ఉన్నారు.