Tuesday, July 8, 2025

భద్రాచలం ఇవొపై గ్రామస్థుల దాడి.. కారణం ఏంటంటే..

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: భద్రాచలం ఆలయ ఇవొ (Bhadrachalam EO) రమాదేవిపై ఓ గ్రామస్థులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందకు వెళ్లిన ఆమెపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాది ఆలయానికి చెందిన 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఎపి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా కొందరు ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఇవొపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇవొ రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News