Sunday, June 15, 2025

బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాం : రామ్మోహన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన తండ్రి కూడా విమానం ప్రమాదంలోనే మరణించారని ఆ బాధ అర్థం చేసుకోగలనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన దుర్ఘటన మరణించిన వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టారని, గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమాన శాఖ సంయుక్తంగా స్పందించిందని చెప్పారు. మంటలార్పి.. మృతదేహాలను వెంటనే అక్కణ్నుంచి తరలించామని, ఈ దుర్ఘటనను పౌరవిమాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని తెలియజేశారు.

దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీ వేశామని, అవసరమైతే మరికొంతమంది సభ్యులనూ బృందంలో చేరుస్తామని అన్నారు. బ్లాక్ బ్లాక్స్ విశ్లేషణ (Analysis Block Blocks) తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందని, బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకునేందుకు తామూ ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని రామ్మోహన్ పేర్కొన్నారు. హోం సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, వివిధ రంగాలకు నిపుణులతో కమిటీ వేశామని చెప్పారు. పౌరవిమానయాన సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారని, 787 సిరీస్ ను తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు చేస్తున్న చిరుసాయం కాస్త ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నానని రామ్మోహన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News