Wednesday, September 17, 2025

సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గం కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్ హైటెక్‌నగర్‌కాలనీ అడ్వజరీ కమిటీ ప్రతినిధులు కెసిసి అధ్యక్షుడు నాగిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో సుభాష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో అప్రో చ్‌రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తానని తెలిపారు. వెంటనే సంభదిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు రవికుమార్,వేంకటేశ్వర్‌రావు,హరినాయణ,ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News