Tuesday, June 17, 2025

మహబూబ్ నగర్ లో వాకిటి శ్రీహరికి ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి అభివృద్ది, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఎంఎల్ఎలు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి, జి.మధు సూధన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్.పి.డి.జానకి, అదనపు కలెక్టర్ లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావులు మంత్రి వాకిటి శ్రీహరికి ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అర్ అండ్ బి అతిథి గృహం ఆవరణలో అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అర్ అండ్ బి అతిథి గృహం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అధికారులు, అనధికారులతో సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News