Tuesday, June 17, 2025

ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించిన హైదరాబాద్ బౌలర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఎనిమిదో ఓవర్ రెండో బంతికి వార్నర్‌ను ఔట్ చేయగా నాలుగు బంతికి సర్ఫరాజ్ ఖాన్, ఆరో బంతికి అమన్ ఖాన్‌ను ఔట్ చేసి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల నడ్డివిరిచాడు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో మనీశ్ పాండే(34), అక్షర్ పటేల్ (34), మిచెల్ మార్ష్(25) కీలకమైన పరుగులు చేయడంతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.

Also Read: మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు: షర్మిల

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News