- Advertisement -
హైదరాబాద్: దొంగ బాబాల్లో ఈ బాబాకు పెట్టింది పేరు. మందులతో కాదు మంచి నీళ్లతో రోగాన్ని మాయం చేస్తానని దొంగ బాబా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఒక దొంగ బాబా ప్రజలను నమ్మించేందుకు సినిమాటిక్ లెవెల్లో ఒక పెద్ద నాటకమే ఆడాడు. ఓ రోగి పెద్ద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని దొంగ బాబా వద్దకు వచ్చాడు. సదరు రోగి ఆక్సిజన్పై బతుకుతున్నట్టుగా బాబా వద్దకు రాగానే సిలిండర్ మాస్క్ తీసేసి బాబా నీళ్లు తాగిపించాడు. వెంటనే రోగం మాయం కావడంతో రోగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ డ్రామా వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. దొంగ బాబాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా దొంగ బాబాలు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Advertisement -