అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భార్య ఉంచుకున్న ప్రియుడుతో కలిసి భర్తను సుపారీ గ్యాంగ్తో మర్డర్ చేయించినట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేయడంతోపాటు హత్యకు ఉపయోగించిన కారు, కొడవళ్లు, మొబైల్స్, జిపిఎస్ పరికరాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గురువారం ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ తేజేశ్వర్ హత్య కేసుపై విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ.. గద్వాల టౌన్కు చెందిన తేజేశ్వర్ ఈ నెల 17న ఉదయం ఇంటి నుండి వెళ్లి తిరిగి రావకపోవడంతో 18న ఆయన అన్న తేజవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
కేస్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ కొనసాగించారన్నారు. భార్య వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పాటు సీసీ కెమెరాలు ఆధారంగా విచారణ చేయగా ఒక కారులో తేజేశ్వర్ను తీసుకెళ్లినట్లు గుర్తించడం జరిగిందన్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో తిరుమలరావు, ఐశ్వర్య, కుమ్మరి నాగేష్, చాకలి పరశురాముడు, చాకలి రాజు, మోహన్, తిరుపతయ్య, సుజాతలను 8 మంది నిందితులుగా తేల్చి అరెస్టు చేయడం జరిగిందన్నారు.
పక్కా స్కెచ్ వేసి హత్య చేశారు
ఆరు నెలల నుండి తిరుమలరావు స్వీపర్ సుజాత, కూతురు ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడు. ఐశ్వర్య రేపు గద్వాలకు చెందిన తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఆయనను చంపాలని స్కెచ్ వేశారు. దీంతో నిందితులు తేజేశ్వర్ను పరిచయం చేసుకున్నారు. పొలం కొంటామని నమ్మబలికి ఈ నెల 17న గద్వాల పొలాలు చూసేందుకు వచ్చి ఆయనను కారులో ఎక్కించుకుని అదే రోజు హత్య చేశారు. తేజేశ్వర్కు సంబంధించిన ఫోన్, బ్యాగులు కృష్ణానదిలో పడేశారు. అక్కడ నుంచి అలంపూర్ చౌరస్తా నుండి బైరాపురం మీదుగా వెళ్తూ పంచలింగాల దగ్గర తిరుమలరావు కార్లు అక్కడికి వచ్చి నిందితులను కొత్త డ్రెస్సులు వేశారన్నారు. అక్కడ నుంచి కారులో డెడ్ బాడీని తీసుకెళిల పాణ్యం ఘాట్ రోడ్డులోని సుగాలి మెట్ట దగ్గర కొత్తగా నిర్మిస్తున్న గాలేరు నగరి కెనాల్ కాలువలో జమ్ములో పడేసి కర్నూల్కు వచ్చారన్నారు.
ప్రధాన నిందితుడు తిరుమలరావు ఈ నెల 19న రూ 50వేలు నగదు ఇచ్చారని, ఆ తర్వాత రూ 2లక్షలు ఇచ్చారని ఎస్పీ వివరించారు. సీసీ కెమెరాల సీసీ పుటేజి, టెక్నికల్ ఎవిడెన్స్తో నిందితులను గుర్తించి గురువారం ఉదయం 5 గంటల సమయంలో పుల్లూరు చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులు ఒక వాహనంలో హైదరాబాద్కు పారిపోతుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుల నుండి ఒక కారు, కొడవళ్లు రెండు, కత్తి, 10 మొబైల్స్, నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అరెస్టు చేసిన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్కు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరచిన గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, ధరూర్ ఎస్ఐ శ్రీహరి, మల్దకల్ ఎస్ఐ నందికర్, గట్టు ఎస్ఐ మల్లేష్, ఐటీ సెల్ ఎస్ఐ సుకూర్, పిఎస్ఐలు స్వాతి, తేజస్విని, సిబ్బంది చంద్రయ్య, రాజు యాదవ్, రామక్రిష్ణ, కిరణ్ కుమార్, వీరేష్, రవి కుమార్, కార్తీక్, శ్రీనివాస్లకు క్యాష్ రివార్డుతో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.