Thursday, June 19, 2025

సమోసా తినిపించి వరుడిని చంపిన వధువు

- Advertisement -
- Advertisement -

రాంఛీ: పురుగుల మందు కలిపిన సమోసాను భర్తతో భార్య తినిపించి హత్య చేసింది. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం గర్హా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరా లప్రకారం… బహోకుదర్ గ్రామంలో బుద్ధనాథ్ సింగ్ అనే యువకుడు 36 రోజుల క్రితం సునీతా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పంటకు పురుగుల మందు కొట్టాలని భర్తతో ఫెస్టిసైడ్ డబ్బా కొనిపించింది. మంగళవారం రాత్రి సమోసాలో పురుగుల మందు కలిసి భర్తకు భార్య తినిపించింది. భర్త స్పృహ కోల్పోయి మృతి చెందాడు. బుధవారం ఉదయం తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. బుద్ధనాథ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సునీతాను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడితో ఉండడం ఇష్టం లేకనే చంపేశానని వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News