- Advertisement -
దుండిగల్ పియస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.బాచుపల్లి పియస్ పరిది రాజీవ్ గృహకల్పలో భార్య భర్తలు నివాసముంటున్నారు. భర్త రాందాస్ ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేట్ లో ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో భార్య జ్యోతి దాడి చేయించింది. అపస్మారక స్థితిలో పడున్న రాందాస్ మృతి చెందాడని యువకులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అర్ధరాత్రి రక్తపు గాయాలతో రాందాస్ తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని తెలిపాడు. బాచుపల్లి పియస్ లో భాదితుడు రాందాస్ ఫిర్యాదు మేరకు హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పియస్ కి వస్తుందని జీరో ఏఫ్ఐఆర్ చేసి దుండిగల్ కి బాచుపల్లి పోలీసులు కేసు ట్రాన్స్ ఫర్ చేశారు.
- Advertisement -