- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పి.జనార్థన్ రెడ్డి(పిజెఆర్) చేసిన కృషి మరువలేనిదని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పేదల నాయకుడిగా పిజెఆర్ ఎంతో గొప్ప పేరు సాధించారని పేర్కొన్నారు. కొండపూర్ నుంచి ఒఆర్ఆర్ వరకు నిర్మించిన పిజెఆర్ ఫ్లైఓవర్ని సిఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి ప్రాంతం ఐటికి హబ్గా ప్రసిద్ధిగా మారిందని.. పిజెఆర్ కృషితోనే గచ్చిబౌలికి హైటెక్ సిటి మంజూరైందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడుతుందని తెలిపారు. ఎంత మంది రాక్షసులు అడ్డుపడిన తమ యజ్ఞం ఆగదని.. రైజింగ్ తెలంగాణ-2027 లక్ష్యాన్ని సాధించి తీరుతామని సిఎం ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -