ప్రతిష్టాత్మక ఆసియా కప్-2025 (Asia Cup) షెడ్యూల్లో నిర్వాహకులు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. క్రికెట్ నిపుణుల అంచనా ప్రకారం సెప్టెంబర్ 10 తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ టోర్నమెంట్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్. పాకిస్థాన్ మధ్య ఉద్రికతలు నెలకొన్నయొ. దీంతో ఆసియా కప్ (Asia Cup) నుండి టీం ఇండియా తప్పుకుంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయతే అవి అవాస్తవాలని బిసిసిఐ కార్యదర్శి దేవిజిత్ వల్లడించారు. అయితే ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్లు తలపడే విషయమే ప్రశ్నార్థకంగా మారింది.
వాస్తవానికి టి-20 ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్కి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్తో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్థాన్లో జరగాల్సిన మ్యాచ్లు యూఎఇలో ఆడనున్నారు. మరి ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్తో మ్యాచ్ ఆడనుందా.? లేదా.? తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాలి. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆరు జట్లు భారత్, అప్గానిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఇ ఉన్నాయి.