- Advertisement -
మన తెలంగాణ/ఆత్మకూరు: కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ ఆత్మకూరు మండలాధ్యక్షుడు కమలాపురం రమేశ్ అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కామారం రామాంజనేయ కాంగ్రెస్ నాయకుడు మూల కన్నయ్య అనారోగ్యంతో మృతిచెందా రు.మండలాధ్యక్షుడు రమేశ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, సమన్వ య కమిటీ సభ్యులు మార్క రజనీకర్గౌడ్, రాజుగౌడ్, మాజీ సీసైటీ వైస్ ఛైర్మన్ రవీందర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు, జిల్లా నాయకులు రాజు, లింగమూర్తి, పలువురు నాయకులు నివాళులర్పించారు.
- Advertisement -