- Advertisement -
రాజేంద్ర నగర్ రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ పై కొందరు దుండగులు అత్యచారం చేసి హత్య చేశారు. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద మహిళ మృత దేహంను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహం పై బట్టలు లేకపోవడం ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానించారు. మృతి చెందిన మహిళ వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.
- Advertisement -