Tuesday, September 16, 2025

మొక్కజొన్న మిషన్‌లో పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

బతుకుదెరువుకోసం వచ్చి మహిళ ప్రాణాలను కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయోధ్యపూర్ తండాకు చెందిన కెతావత్‌చంద (32) తుమ్మలపల్లి గ్రామానికి కూలి పనుల నిమిత్తం తుమ్మలపల్లి గ్రామానికి వచ్చింది. పనుల్లో భాగంగా మొక్కజొన్న మిషన్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి అక్కడిక్కకడే మృతి చెందింది. కుటుంబపోషణ కోసం ఊరుగాని ఊరువచ్చి ప్రాణాలు కోల్పోవడంతో మృతురాలి కుటుంభసభ్యుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News