హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నగరంలోని దబిపురకు చెందిన అమిత్ కరణ్-కృతిక దంపతులు కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత ఆలయానికి వెళ్లి ఆదివారం దర్శనం పూర్తి చేసుకున్నారు. మళ్లీ తిరిగి హైదరాబాద్కి వస్తుండగా.. సోమవారం కారు కూకట్పల్లిలో ఆగిపోయింది.
వాహనం ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో కృతిక తన కుమారుడితో కలిసి కారు దిగింది. ఇంతలో వెనక నుంచి వచ్చిన బొలెరో వాహనం అతి వేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొనడంతో ఆమె ఎగిరి కొంత దూరంలో పడింది. ఆమెను ఢీకొట్టిన వాహనం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కృతికతో పాటు ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిరువురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.