Thursday, June 19, 2025

సికింద్రాబాద్ లో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్ లో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సికింద్రాబాద్ లోని అంబేద్కర్ నగర్ లో ఉంటున్న మహిళ గత కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కాగా శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు మద్యం తాగవద్దని మందలించారు.

దీంతో మనస్థాపానికి గురైన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News