Thursday, June 26, 2025

స్నేహితులని కలిసొస్తానని చెప్పి.. హోటల్ గదిలో ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ (Raidurg Police) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ బ్యూటీషియన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుష(26) అనే మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో బిహెచ్‌ఇఎల్ సమీపంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆదివారం స్నేహితులను కలిసి వస్తానని చెప్పి.. ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ, ఎలాంటి స్పందన రాలేదు.

సోమవారం ఓ హోటల్ గదిలో ఆమె ఆమె అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అనుష స్నేహితుడు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని అనుష సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News