Tuesday, July 1, 2025

మహిళపై ఆర్‌ఎంపి వైద్యుడు అత్యాచారం..ఆపై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లా, గుర్రంపోడు మండలం , జూనుతల గ్రామంలో ఒక మహిళపై ఆర్‌ఎంపి వైద్యుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా హత్యాయత్నానికి ప్రయత్నించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనూతల గ్రామానికి మంకెన జ్యోతి (32) జీవనోపాధి నిమిత్తం మిర్యాలగూడలో నివసిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వెళుతూ ఉండేది. అదే గ్రామంలో ఆర్‌ఎంపిగా పని చేస్తున్న మహేష్‌తో ఆమెకు గతం నుంచే వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల వారి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మహేష్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దేవరకొండ నుంచి కారులో ఆమెను తీసుకెళుతుండగా మార్గమధ్యలో వారిద్దరితో వాగ్వాదం జరిగింది.

ఆ సమయంలో మహేష్ తనతో తీసుకొచ్చిన గడ్డిమందును బలవంతంగా ఆమెకు తాగించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు కారును ఆపి తనిఖీ చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఇదిలావుండగా, ఈ కేసును ఆత్మహత్యగా మలచేందుకు మహేష్ తీవ్రంగా ప్రయత్నించాడని మృతురాలి భర్త, బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ పి.మధు తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News