‘ఆడపిల్లలకు శక్తినిద్దాం..ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో మరో సరికొత్త పథకం ‘ఇందిరమ్మ అమృతం’ పేరుతో ప్రారంభించబోతోంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందజేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ అమృతం పేరుతో కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు పల్లి, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచింతగా పంపిణీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేశారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- ప్రకారం రాష్ట్రంలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కౌమార బాలికల సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే కొత్త పథకం ‘ఇందిరమ్మ అమృతం’ పేరుతో 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న కౌమార బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తారు.