Wednesday, April 30, 2025

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. ప్రైజ్ మనీని భారీగా పెంచిన ICC

- Advertisement -
- Advertisement -

యుఎఇ వేదికగా అక్టోబర్ 3వ తేదీ నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని భారీగా పెంచుతున్నతట్లు వెల్లడించింది. వరల్డ్ కప్ లో మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ప్రైజ్‌మనీ అందిస్తామని తెలిపింది.

ఈసారి విజేత జట్టుకు 2.34 మిలియన్ డాలర్లు(రూ.19 కోట్ల) ప్రకటించింది. ఇది గతేడాది టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ(1 మి.డాలర్లు) కంటే 134 శాతం ఎక్కువ. రన్నరప్ టీమ్‌కు 1.17 మి.డాలర్లు(రూ.9 కోట్లు) ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో రన్నరప్ కు 5 లక్షల డాలర్లు ఇచ్చారు. ఇక, సెమీ ఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు 6,75,000 డాలర్లు ఇవ్వనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News