Sunday, June 15, 2025

అదరగొట్టిన మార్‌క్రమ్, బవుమా గెలుపు బాటలో సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో డబ్లూటిసి ఫైనల్
లండన్: లార్డ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా గెలుపు ముంగిట నిలిచింది. 285 పరుగుల లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన దక్షిణాఫ్రికా శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజ యం సాధించాలంటే సఫారీ టీమ్ మరో 69 పరుగులు చేయాలి. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్, కెప్టెన్ తెంబ బవుమా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రికెల్టన్ ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ముల్డర్ (27) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కానీ మార్‌క్రమ్, బవుమా అద్భుత పోరాట పటిమతో సౌతాఫ్రికాను పటిష్ఠస్థితిలో నిలిపారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్‌క్రమ్ 159 బంతుల్లో 11 ఫోర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బవుమా 65 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ 58 (నాటౌట్) జట్టును ఆదుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News